సంచార జాతులకు చెందిన వీరభద్ర యులకు ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని వీరబద్రియ కుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కె శివకుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని పద్మశాలి భవనం లో ఇంటర్మీడియట్లో టాప్ ర్యాంకు సాధించిన కాటి కళ్యాణి నీ వీరబద్రియ కుల సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచార జాతికి చెందిన అతి పేద కుటుంబంలో జన్మించిన కాటి కళ్యాణి రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంకర్గా నిలిచిందని ఈ సందర్భంగా ఆమెను అభినందించారు. లోని రాష్ట్రంలోనే కళ్యాణి చరిత్రను తిరగరాసిందని, ప్రభుత్వం సంచార జాతుల ను గుర్తించి విద్య పరంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటి నాగరాజు, ఉపాధ్యక్షులు మిట్టపల్లి ప్రభాకర్, జాతీయ సహాయ కార్యదర్శి రావూరి కృష్ణ, పట్టణ అధ్యక్షుడు మిట్టపెల్లి సుదర్శన్, బిక్షపతి , శ్రీనివాస్ , మంగయ్య తదితరులు పాల్గొన్నారు.