బెంగళూరులో డాక్టర్ గా పని చేస్తూ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐస్ కు స్లీపర్ సెల్ గా ఉన్న ఒక వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది.
గాయపడ్డ ఐసిస్ ఉగ్రవాదులకు వైద్యసహాయం అందించేలా మెడికల్ యాప్, ఆయుధాలకు సంబంధించిన యాప్ను రూపొందిస్తున్నాడనే ఆభియోగాలపై బెంగళూరుకు చెందిన డాక్టర్ అబ్దుల్ రెహమాన్ (28)ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అబ్దుల్ రెహమాన్ బెంగళూరులోని ఎమ్మెఎస్ రామయ్య మెడికల్ కాలేజీలో కంటి డాక్టర్గా పనిచేస్తున్నాడు. అతనికి ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్కేపీ) సంస్థతో కలిసి పనిచేస్తున్నాడని అధికారులు తెలిపారు.
అబ్దుల్ రెహమాన్ 2014 ప్రథమార్థంలో సిరియాలో ఏర్పాటుచేసిన ఐసిస్ మెడికల్ క్యాంప్కు హాజరయ్యాడని, అక్కడ ఉగ్రవాదులకు పది రోజులపాటు వైద్యం చేశాడని, అనంతరం భారత్కు తిరిగి వచ్చాడని అధికారులు ప్రకటించారు. తిరిగి వచ్చిన తర్వాత అతను ఐసిస్ ఉగ్రవాద సంస్థకు స్లీపర్ సెల్ గా పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.