ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఫంక్షన్ హాల్ లో నేడు తెలంగాణ బీజేపీ యువ మోర్చా నిరుద్యోగ సదస్సు జరిగింది.
ఈ కార్యక్రమానికి బాగ్ అంబర్పేట్ డివిజన్ బీజేపీ యువ మోర్చా అధ్యక్షులు ఏడేల్లీ బాలు ఆధ్వర్యంలో నిరుద్యోగులు, యువ మోర్చా నాయకులతో బైక్ ర్యాలీగా వెళ్లారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాగ్ అంబర్ పేట్ కార్పొరేటర్ బి. పద్మ వెంకట్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి యువ మోర్చా నాయకులు గోవింద్ అర్జున్, నాగరాజ్ చారి, గుగ్గిళ్ళ శ్రీనివాస్, బాలకృష్ణ గౌడ్, అనిల్ రామ్, సాయి టాగూర్, కౌశిక్ గౌడ్, శివ, మహేష్ కుమార్, క్రాంతి, అనిల్ బాలు, దుర్గ, శేఖర్, సాయి కుమార్, అజయ్, తదితరులు పాల్గొన్నారు.