ఖరీదైన బట్టలు వేసుకుని కింద కూర్చున్న వ్యక్తులు ఎవరో తెలుసా? తెలియక పోతే వీరి గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే దారుణమైన దొంగ సారా తయారు చేసే బ్యాచ్ ఇది. చూస్తే నమ్మ బుద్ధి కావడం లేదు కదూ? నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన వీరు నల్ల బెల్లం అమ్మకంలో సుప్రసిద్ధులు.
బ్లాక్ దందాకు అలవాటు పడ్డ వీరిని ఇప్పటికే ఆబ్కారీ పోలీసులు చాలా సార్లు పట్టుకున్నారు. వారిపై కేసులు పెట్టారు. ఎన్ని సార్లు పట్టుకున్నా వీరి బుద్ధి మాత్రం మారడం లేదు. కొల్లాపూర్ పట్టణానికి చెందిన సూర్యుడు శెట్టి, వెంకటయ్య శెట్టి, శేషయ్య శెట్టి అనే వీరు నల్లబెల్లం అమ్ముతుండగా పట్టుకున్నట్లు ఎక్సైజ్ సిఐ ఏడుకొండలు తెలిపారు.
బుధవారం దొంగ సారా బట్టీలపై ఎక్సైజ్ శాఖ కు చెందిన డిటీఎఫ్ బృందం పెంట్లవెల్లి మండల ప్రాంతంలోని యగంపల్లితాండ లో దాడులు నిర్వహించింది. మొత్తం 680 కిలోల ఆలం, 400 లీటర్ల ఎఫ్ జె వాష్ కనుగొని వాటిని ధ్వంసం చేశామని కొల్లాపూర్ ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు తెలిపారు. నాగర్ కర్నూల్ డిటీఎఫ్ బృందం ఈ విధంగా ఈ ప్రాంతంలో తరచూ దాడులు చేస్తూనే ఉన్నది.