రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ని తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తామని ములుగు జిల్లా ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామానికి చెందిన 80 మంది పట్టభద్రులు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జ్ ఎరువ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో తీర్మానం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తన పుట్టిన గ్రామానికి వచ్చిన సతీష్ రెడ్డి గ్రామాభివృద్ధికి పూర్తి బాధ్యత తనదేనని తెలపడంతో పట్టభద్రులు అంతా ఏకతాటిపైకి వచ్చి పల్లా గెలుపుకు తాము ముందుంటామని తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూరాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరుగుతుందని అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి టిఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని తెలిపారు.
ప్రతి పట్టభద్రుడు దేవగిరిపట్నం పట్టభద్రులను ఆదర్శంగా తీసుకొని టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు.