ఓ లారీ బొలెరో కారు డి కొని ముగ్గురు మరణించిన సంఘటన మేడ్చల్ జిల్లా శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు పై చోటుచేసుకుంది. ఓఆర్ఆర్ పెట్రోలింగ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ నుండి కీసర వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్ పైనుండి ఎగిరి ఎదురుగా వస్తున్న బొలెరో కారును డి కొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికకడే మృతి చందరు.
బొలెరో కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా అందులో ఇద్దరు మరణించారు ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులలో ఒకరు మృతి చందగా మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని క్షతగాత్రులను అంబులెన్సు లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందచేస్తున్నారు.