నైజీరియాలో ఘోర దుర్ఘటన జరిగింది. బాంబు పేలిన ఈ ఘటనలో దాదాపు 30 మంది వరకు మరణించి ఉండవచ్చునని సమాచారం. నైజీరియాలోని బోర్నోలో ఉన్నబ్రిడ్జిపై ఓ మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ ఎప్పుడూ ప్రజలతో రద్దీగా ఉంటుంది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 5 గంటలకు బ్రిడ్జిపై ఈ బాంబు పేలినట్లు తెలుస్తోంది. గాంబోరులోని ఈ బ్రిడ్జి.. ఆఫ్రికాదేశ పట్టణమైన కామెరూన్ను కలుపుతుంది.
ఈ దాడిలో దాదాపు 35 మందికిపైగా గాయపడ్డారని, వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు ప్రత్యక్ష సాక్షి అయిన మోదు అలీ సయిద్ తెలిపారు. ఈ ఘటన తమకు చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. ‘నేను ఏదో పెద్ద శబ్దం విన్నాను. అదేంటో తెలుసుకునేలోపే ఘోరం జరిగిపోయింది. నా స్నేహితులు మరియు నా చుట్టుపక్కల ఉన్నవాళ్లలో చాలా మంది అప్పటికే చనిపోయారు’ అని అలీ తెలిపారు.