38.2 C
Hyderabad
May 3, 2024 19: 09 PM
Slider ప్రపంచం

టెర్రర్:మార్కెట్లో బాంబు పేలి 30 మంది మృతి

bomb explosion

నైజీరియాలో ఘోర దుర్ఘటన జరిగింది. బాంబు పేలిన ఈ ఘటనలో దాదాపు 30 మంది వరకు మరణించి ఉండవచ్చునని సమాచారం. నైజీరియాలోని బోర్నోలో ఉన్నబ్రిడ్జిపై ఓ మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ ఎప్పుడూ ప్రజలతో రద్దీగా ఉంటుంది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 5 గంటలకు బ్రిడ్జిపై ఈ బాంబు పేలినట్లు తెలుస్తోంది. గాంబోరులోని ఈ బ్రిడ్జి.. ఆఫ్రికాదేశ పట్టణమైన కామెరూన్‌ను కలుపుతుంది.

ఈ దాడిలో దాదాపు 35 మందికిపైగా గాయపడ్డారని, వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు ప్రత్యక్ష సాక్షి అయిన మోదు అలీ సయిద్ తెలిపారు. ఈ ఘటన తమకు చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. ‘నేను ఏదో పెద్ద శబ్దం విన్నాను. అదేంటో తెలుసుకునేలోపే ఘోరం జరిగిపోయింది. నా స్నేహితులు మరియు నా చుట్టుపక్కల ఉన్నవాళ్లలో చాలా మంది అప్పటికే చనిపోయారు’ అని అలీ తెలిపారు.

Related posts

మహిళా దినోత్సవం సందర్భంగా “రన్ ఫర్ వుమెన్ సేఫ్టీ”

Satyam NEWS

టూరిస్ట్ స్పాట్: నల్లమల్ల ను పర్యాటక హబ్ గా మారుస్తాం

Satyam NEWS

ఎలుగుబంటి దాడిలో ఇద్దరికి గాయాలు

Satyam NEWS

Leave a Comment