బోనాల పండుగ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ ఎంపీ వి. హనుమంత రావు అంబర్ పేట మహంకాళి ఆలయంలో అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరిని చల్లగా చూడాలని కోరుకున్నారు. ఆదివారం బోనాల పండుగ సందర్భంగా కుటుంబ సమేతంగా గోల్నాక డివిజన్ శాంతి నగర్ లోని అమ్మ వారి ఆలయాన్ని సందర్శించారు. అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పద్మా దంపతులు పట్టు వస్త్రాలు, బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అంబర్ పేట దేవస్థాన సేవా సమితి వారు, అశేష సంఖ్యలో భక్తులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.