బిచ్కుంద మండలంలోని వాజిద్నగర్ గ్రామంలో నాలుగు లక్షల నిధులతో సిసి రోడ్లు మురికి కాలువల నిర్మిణ పనులను సర్పంచ్ అనుయ లక్ష్మీ నారాయణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి వార్డులో మురికి కాలువల నిర్మాణం చేపడుతున్నామన్నారు.
గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పంచాయతీ పాలక వర్గ సభ్యులందరూ కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు ఎంపిటిసి బండ కింది సాయిలు, ఉపసర్పంచ్ బద్రి సాయిలు, గ్రామ పెద్దలు గోపాల్రెడ్డి శివరాజ్ పటేల్ లక్ష్మీనారాయణ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పంచాయతీ కార్యదర్శి శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు.