సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ ను తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ సభ్యుడు గా నియమించారు. ఈ సందర్భంగా యరగాని నాగన్న గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మధుయాస్కి గౌడ్ నేతృత్వంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,రాహుల్ గాంధీ ఆదేశాలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ తనను తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు గా నియామకం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేశారు.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి కార్మిక,కర్షక,పేదల యొక్క అభ్యున్నతి కొరకు కాంగ్రెస్ పార్టీ చేసిన,చేయబోయే అభివృద్ధి పథకాలను తెలియజేస్తూ తనవంతు వంతు కృషిని శక్తి వంచన లేకుండా చేస్తానని యరగాని నాగన్న గౌడ్ తెలిపారు.తన నియామకానికి సహకరించిన డాక్టర్ జి.సంజీవరెడ్డి కి, నల్లగొండ పార్లమెంటు సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కి, మధుయాష్కీ కి,ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్