ఈ సంవత్సరం ఘనంగా ఆషాఢ బోనాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
జులై 11 న గోల్కొండ బోనాలు, 25 వ తేదీన సికింద్రాబాద్ బోనాలు, ఆగస్టు 1 వ తేదీన హైదరాబాదు బోనాల ఉత్సవాలు జరుగుతాయి.
ఆషాడమాసం బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCHRD) లో నేడు అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా బోనాలను నిర్వాహించుకోలేక పోయామని అందువల్ల ఈ సారి ఈ నెల 25 న రాష్ట్ర ప్రభుత్వం తరపున బోనాల ఉత్సవాల నిర్వహణ ఉంటుందని ఆయన తెలిపారు.
దీని కోసం వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు 15 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.