ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటం అంతా కూడా పొలిటికల్ డ్రామా అని ఆయన వ్యాఖ్యానించారు.
యోగ డే సందర్భంగా విశాఖ బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగి యోగ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా అందరూ యోగ లో పాల్గొంటున్నారని ఆయన అన్నారు. యోగ ఇంత ప్రాధాన్యత వచ్చిందంటే అది దేశ ఘనత అని ఆయన తెలిపారు.
మానవాళి జీవన విధానాన్ని కి యోగ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో నదుల అంశాలు మీద తెలంగాణ స్టడీ చేసిన విధంగా ఏపీ చేయలేక పోయిందని, ఏపీ కి నీటి విషయంలో అన్యాయం జరుగుతున్నదని వీర్రాజు అన్నారు.
నదుల అనుసంధానం పై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన కోరారు.