అమెరికాకు చెందిన ఆర్ బోనీ గాబ్రియెల్ మిస్ యూనివర్స్ 2022 కిరీటాన్ని పొందారు. మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు తన కిరీటాన్ని గాబ్రియెల్కి అందజేశారు. ఈ పోటీలో వెనిజులాకు చెందిన అమండా డుడామెల్ మొదటి రన్నరప్గా నిలిచారు. డొమినికన్ రిపబ్లిక్కు చెందిన ఆండ్రినా మార్టినెజ్ రెండో రన్నరప్గా నిలిచింది.
భారత క్రీడాకారిణి దివితా రాయ్ సెమీ ఫైనల్కు చేరుకుని నిష్క్రమించింది. 71వ మిస్ యూనివర్స్ పోటీ USAలోని లూసియానా రాష్ట్రంలోని న్యూ ఓర్లీన్స్ నగరంలో నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా 84 మంది పోటీదారులను ఓడించి గాబ్రియెల్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. వెనిజులా, అమెకిటా, ప్యూర్టోరికో, క్రురాసావో మరియు డొమినికన్ రిపబ్లిక్ నుండి పోటీదారులు టాప్-5కి చేరుకున్నారు.