నిర్మల్ జిల్లా బాసర లోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ అమ్మవారి సన్నిధిలో వ్యాసపురి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్, బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మురళీధర శర్మ ఆధ్వర్యంలో లక్ష వత్తుల నోము, ఋషి పంచమి వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించారు. లోక కళ్యాణం కోసం రెండు రోజుల పాటు ఋత్వికులు ఈ క్రతువును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరుగురు బ్రాహ్మణ దంపతులు పాల్గొని లోకకళ్యాణార్థం ప్రత్యేక పూజలు చేశారు. రెండు రోజుల దీక్షలో భాగంగా లక్ష వత్తుల నోము కార్యక్రమంతో పాటు ఋషిపంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. లక్ష వత్తుల నోములో ఆరుగురు జంటలు పాల్గొని విడివిడిగా ఒక్కొక్కరు లక్ష వత్తుల దీపారాధన చేశారు.
previous post