తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా ఉద్యమకారులు ప్రస్తుత వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి కేసిఆర్ సంక్షిప్త జీవిత చరిత్రను అంధులు చదువుకునే బ్రెయిలీ లిపిలో ముద్రించారు. KCR సంక్షిప్త జీవిత చరిత్ర బ్రెయిలీ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
ఈ ఆలోచన అత్యద్భుతమని మంత్రి కేటీఆర్ వాసుదేవ రెడ్డి బృందాన్ని ప్రశంసించారు. ఇక ఈ బ్రెయిలీ పుస్తకాన్ని అంధులు చదివి వినిపిస్తుండగా ఒకసారిగా అందరి మనసులు భావోద్వేగంతో నిండిపోయాయి.
ఈ కార్యక్రమంలో వాసుదేవరెడ్డి తో పాటు MP వద్దిరాజు రవిచంద్ర, MLC కర్నే ప్రభాకర్, బాలమల్లు, సతీష్ రెడ్డి, కాన్సెప్ట్ డైరెక్టర్ లక్ష్మణ్ మురారి, రమేష్ మాదాసు తదితరులు పాల్గొన్నారు.