చిత్తూరు జిల్ల నగరి కి చెందిన ఒక వ్యక్తికి క్యాన్సర్ సోకినట్లు తెలియడంతో రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ఆర్ధిక సాయం చేసింది. వడమాలపేట దాసరి వీదికి చెందిన తులసి తనకి క్యాన్సర్ సోకిందని రాంప్రసాద్ దృష్టికి తెచ్చారు. ఆ విషయం మంత్రి రోజా కు తెలియడంతో తన వంతు తక్షణ సాయంగా రోజా చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ.50 వేల అందజేయటం జరిగింది.
ఆయన మెడికల్ రిపోర్ట్ చూసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం టాటా క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్స్ తో కూడా మంత్రి మాట్లాడారు. నా నియోజకవర్గ ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వైసిపి కార్యకర్తలకి గానీ, నాయకులకు గానీ ఎటువంటి అపద వచ్చినా నేను నా కుటుంబం వెన్నంటి ఉంటాము అని ఈ సందర్భంగా మంత్రి రోజా తెలిపారు.