శ్రీకాకుళం పట్టణంలోని విశాఖ ఎ కోలనీలో బ్రైట్స్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇనిస్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో బ్రైట్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో శ్రీకూర్మనాథస్వామి పాలకమండలి సభ్యులు శ్రీమతి పూడి కమల ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈసందర్భంగా కమల మాట్లాడుతూ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇంగ్లీషు ప్రాధాన్యత గురించి వివరిస్తూ, బ్రైట్స్ సంస్థ వారి నిబద్ధతతో కూడిన సేవలను కొనయాడారు. సంస్థ కర్స్పాండెంట్ ఉదయ భాస్కర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు మాసంస్థలో చదివిన వారు 120 మంది వివిద సంస్థలలో ఉద్యోగాలు పొందారని చెప్పారు.
ఈకార్యక్రమంలో పూడి జనార్దన రావు, డి వెంకటేశ్వరరావు, జి నర్సింగ రావు, బి సూర్యారావు, డాక్టర్ రవి,ఎమ్ నాగేశ్వర ప్రసాద్, మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.