Slider రంగారెడ్డి

కాంగ్రెస్, బిఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరు అవినీతి పరులే

#enugu

మేడ్చల్ నియోజకవర్గం మూడు చింతలపల్లి అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగన్ గూడ,కేశవరం,నాగిశెట్టిపల్లి,అద్రాస్ పల్లి,ఉద్దమర్రి,కేశ్వాపూర్ గ్రామాలలో గడప గడపకు ప్రచార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి మరియు జిల్లా రూరల్ అధ్యక్షుడు విక్రం రెడ్డి  విచ్చేశారు వారికి కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు అనంతరం గడపగడపను ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులిద్దరూ అవినీతి పరులని, భూ కబ్జాలు, అక్రమ దందాలకు పాల్పడుతున్నరని మేడ్చల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజల రక్తం తాగుతున్న ఒక్కొక్కరి సంగతి తేలుస్తామని చెప్పారు.బిఆర్ఎస్,కాంగ్రెస్ ను పొరపాటున గెలిపిస్తే ఇండ్లు, రేషన్ కార్డులు, ఉద్యోగాలు ఏవీ రావన్నారు.కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

వయెావృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదే….

Satyam NEWS

సెలబ్రేషన్స్: పతంగుల పండుగలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

Satyam NEWS

నరసరావుపేట డిపో నుంచి సంక్రాంతి స్పెషల్ బస్సులు

Satyam NEWS

Leave a Comment