మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీని వీడటంతో నేతలంతా ఐక్యత రాగం అందుకుంటున్నారు. ఇప్పటి వరకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న వారు ఒక్కటేయ్యే ప్రయత్నం జరుగుతుంది. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు నివాసంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, అభ్యర్థి మదన్ లాల్, ఎమ్మెల్సీ తాత మధు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు పై వీరు చర్చించారు. తుమ్మల పార్టీని వీడిన తరువాత తాజా పరిస్థితులు చర్చకు వచ్చినట్లు సమాచారం. అంత కలిసికట్టుగా ఉండి ఎన్నికల బరిలో ఉండాలని నేతలకు ఎంపి నామా సూచించారు.