26.7 C
Hyderabad
May 3, 2024 10: 25 AM
Slider గుంటూరు

రోడ్డు ప్రమాదంలో బీటెక్ స్టూడెంట్ మృతి….

#BtechStudent

గుంటూరు జిల్లా లో నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ స్టూడెంట్ మరణించడం చూసిన వారి హృదయం ద్రవించింది. శావల్యపురం మండలం కృష్ణ పురం వద్ద గుర్తు తెలియని వాహనం డీ కొనడంతో గుర్రపు నాయుడు వారిపాలెం గ్రామానికి చెందిన బీటెక్ సెకెండ్ ఇయర్ స్టూడెంట్ యాగంటి నవీన్ కి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఫంక్షన్ నిమిత్తం తన సోదరిని రొంపిచర్ల గ్రామంలో తమ బంధువుల ఇంట్లో వదిలిపెట్టి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి నవీన్ ను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మర్గమధ్య లోనే అతడు మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డాllచదలవాడ అరవింద బాబు హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన పోలీసులను కోరారు.

Related posts

కోనసీమ అందమైన లొకేషన్లలో ‘శశివదనే’ షూటింగ్ పూర్తి

Satyam NEWS

పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం: ఎమ్మెల్యే చిరుమర్తి

Satyam NEWS

తుది శ్వాస విడిచిన మహాభారత్ భీముడు

Satyam NEWS

Leave a Comment