పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మున్సిపాలిటీలోని 6వ వార్డులో ఆదివారం రోజున 3వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం స్థానిక కౌన్సిలర్ పందిరి గీత అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వార్డు ప్రజలందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
పారిశుధ్యం విషయంలో ఖర్చుకు వెనడుగువేసేది లేదని అన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు, నోటీసులిస్తామని హెచ్చరించారు.
వార్డు అభివృద్ధికి ప్రజలంతా స్వచ్చందంగా ముందుకు రావాలిని కోరారు.15 లక్షల రూపాయలతో ఇప్పటికే పలు అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్నామని తెలిపారు.
వారం రోజుల్లోపు 20 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తామని లింగయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో లో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆది మల్లయ్య, కమిషనర్ ఎం రామ దుర్గా రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు తదితరులు పాల్గొన్నారు