కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన పౌరసత్వ చట్టంపై అవగాహన కల్పించేందుకు కరపత్రాల ద్వారా ప్రచారం చేయాలని నిర్మల్ జిల్లా బీజేపీ నిర్ణయించింది. నిర్మల్ లోని పార్టీ ఆఫీస్ లో జిల్లా ఉపాధ్యక్షుడు ఆఢెపు సుధాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో సుధాకర్ మాట్లాడుతూ సహకార సంఘ ఎన్నికల్లో జిల్లాలోని అన్నీ వార్డ్ లలో పోటీ చెయ్యాలని నిర్ణయించారు.
అలాగే అయ్యన్న గారి భూమయ్య, రావుల రాంనాథ్ తదితరులు ప్రసంగించారు. సామ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం సంస్థాగతంగా అన్ని గ్రామాలలో జిల్లా వ్యాప్తంగా ఈ నెలలోనే బూత్, మండల కమిటీలను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు ఆఢెపు సుధాకర్, కేంద్ర ప్రభుత్వ విత్తన సంస్థ పాలక మండలి సభ్యులు అయ్యన్న గారి భూమయ్య పాల్గొన్నారు.
ఇంకా కృష్ణ గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రాంనాథ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఒడిసెల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి, భుచ్చన్న యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు జుట్టు వెంకట్ రమణ, ఖానాపూర్ అసెంబ్లీ కన్వీనర్ పడాల రాజ శేఖర్, జిల్లా పదాధికారులు, వివిధ మోర్చా ల అధ్యక్షులు అన్ని మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.