38.2 C
Hyderabad
April 28, 2024 22: 57 PM
Slider నల్గొండ

పివి రావు మాల మహానాడు కొవ్వొత్తుల ర్యాలీ

#MalaMahanadu

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం పివి రావు మాల మహానాడు ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నియోజకవర్గ అధ్యక్షుడు కోల్లపూడి యోహాన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.

సంఘం నాయకులు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ లో దారుణంగా అత్యాచారానికి గురైన దళిత మహిళ మనిషా వాల్మీకికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని దళితులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.

ఈ కార్యక్రమంలో పివి రావు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మి మల్ల నరసింహారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కోటేశ్వరరావు, రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ సాలె రామారావు, రాష్ట్ర నాయకులు ఇట్టిమల్ల బెంజిమెన్, రాష్ట్ర కార్యదర్శి చప్పిడి నరసింహారావు, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు సూదుల రాములు, సూర్యాపేట జిల్లా నాయకులు గొట్టుముక్కల రాములు,

జిల్లా మహిళా నాయకురాలు రమణ, హుజూర్ నగర్ మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు శీలం స్వరూప, నియోజక వర్గ సభ్యులు మామిడి జాన్ రత్నం, మేళ్లచెరువు మండల అధ్యక్షుడు ఎర్ర గోపయ్య, మండల నాయకులు శేషు, లక్ష్మణ జెంట్స్ ,సప్పిడి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

విజయనగరం లో విచిత్రం..”సత్యం న్యూస్. నెట్ “కు చిక్కిన చిత్రం..

Satyam NEWS

దసరాకు టీఎస్ఆర్టీసీ 5265 ప్రత్యేక బస్సులు

Bhavani

మార్కెటింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం

Satyam NEWS

Leave a Comment