మహా శివరాత్రి పర్వదిన సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు మండల కేంద్రంలో స్వయం వ్యక్తమైన శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి వారిని శనివారం నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకులు కొంకపాక శివవిష్ణువర్ధన్ శర్మ ఆలయ సంప్రదాయం ప్రకారం ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో,పాడి పంటలతో సుఖంగా ఉండాలని ఈశ్వరుణ్ణి వేడుకున్నట్లు తెలిపారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్