పవిత్ర సోమవారం పొద్దుపొద్దున్నే ఉపాధి కోసం బయలుదేరిన ఓ దంపతుల ప్రాణాలు పరమ శివునిలో ఐక్యమైపోయాయి. కారు,మోపెడ్ ఒకదానికొకటి ఢీకొనడంతో భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి బస్టాండ్ సమీపంలో కారు బైక్ ఢీ కొన్నాయి. బైక్పై ఉన్న భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు గుంటూరు జిల్లాలో పిడుగురాళ్ళకు చెందిన ఎలుమోలు అంజి, లక్ష్మీగా గుర్తించారు. ఈ దంపతులిద్దరరూ వంట పాత్రలు అమ్ముకుని జీవిస్తున్నారు.వేకువ జామునే లేచి గ్రామాలకు తిరుగుతూ వంట పత్రాలు అమ్ముకోవడానికి బయలు దేరిన దంపతులు మృత్యు వాత పడటం తో వారి బంధువులలో కుటుంబ సభ్యులలో విషాదం నెలకుంది.