నేరాలను నియంత్రించేందుకే కట్టడి ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని బాలానగర్ డిసిపి పద్మజ అన్నారు. బుధవారం రాత్రి మేడ్చల్ జిల్లా మండల కేంద్రం శామీర్పేటలోని నల్సార్ లా యూనివర్సిటీ సమీపంలో గల పెద్దమ్మ కాలనీలో ఇంటింటికి తనిఖీలు నిర్వహించారు.
స్థానిక మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ నివాసముంటున్న వారితో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలను మహిళలను అడిగి తెలుసుకున్నారు. అనుమానితులు ఎవరైనా ఉంటే సమాచారం ఇవ్వాలని సూచించారు. సరైన పత్రాలు లేని, పెండింగ్ చలానా ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ తనిఖీలో పేట్ బషీరాబాద్ ఏసీపీ నరసింహారావు, నలుగురు సిఐలు, పది మంది ఎస్సైలు, 88 మంది పోలీస్ సిబ్బంది తో కలిపి మొత్తం మంది తనిఖీల్లో పాల్గొన్నారు. అలాగే శామీర్ పేట, తుర్కపల్లి, తుంకుంట, మజీద్పూర్ పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించారు.