ఎందుకు చేశాడో తెలియదు కానీ ఒక తండ్రి తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. గుండెలు కదిలించే ఈ దృశ్యం వికారాబాద్ జిల్లా గుండ్లమడుగుతండాలో కనిపించింది. కుటుంబ తగాదాల కారణంగానే అతను ఈ విధంగా చేశాడని స్థానికులు అంటున్నారు. తాండూరు మండలం గుండ్లమడుగుతండాలో కుటుంబ తగాదాలతో ఇద్దరు పిల్లను చెట్టుకు ఉరివేసి తండ్రి కూడా ఉరివేసుకున్నాడు.
ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మధ్యాహ్నం వరకు కనిపించిన చిన్నారులు చనిపోవడంతో స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.