28.7 C
Hyderabad
April 28, 2024 06: 12 AM
Slider రంగారెడ్డి

ట్రాజెడీ: ఇద్దరు పిల్లల్ని చంపాడు, తానూ చనిపోయాడు

father killed

ఎందుకు చేశాడో తెలియదు కానీ ఒక తండ్రి తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. గుండెలు కదిలించే ఈ దృశ్యం వికారాబాద్ జిల్లా గుండ్లమడుగుతండాలో కనిపించింది. కుటుంబ తగాదాల కారణంగానే అతను ఈ విధంగా చేశాడని స్థానికులు అంటున్నారు. తాండూరు మండలం గుండ్లమడుగుతండాలో కుటుంబ తగాదాలతో ఇద్దరు పిల్లను చెట్టుకు ఉరివేసి తండ్రి కూడా ఉరివేసుకున్నాడు.

ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మధ్యాహ్నం వరకు కనిపించిన చిన్నారులు చనిపోవడంతో స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

మహారాష్ట్ర నుంచి గుట్కా ప్యాకెట్ల స్మగ్లింగ్

Satyam NEWS

జనవరి 18 నుంచి మారుతున్న జగన్ జాతకం

Satyam NEWS

పెద్దశేష వాహనంపై వైకుంఠనాథుని అలంకారంలో శ్రీప‌ద్మావ‌తి

Satyam NEWS

Leave a Comment