బాబ్రీ మసీదు కేసులో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితర నేతలను నిర్దోషులుగా తేల్చుతూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని బిజెపి కేంద్ర రాష్ట్ర సమన్వయకర్త నూనె బాల్ రాజ్ అన్నారు.
వాస్తవం ఎప్పుడూ ఓడిపోదు. ఇంతకాలం అవాస్తవాలు ప్రచారం చేసిన వారికి ఈ తీర్పు చెంపపెట్టు లాంటిది అని ఆయన అన్నారు.
బాబ్రీ మసీదును అసాంఘిక శక్తులు కూల్చి వేస్తుంటే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి వంటి నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారని కోర్టు గుర్తించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని నూనె బాల్ రాజ్ తెలిపారు.
సుదీర్ఘ కాలం కేసు నడిచినా న్యాయమే గెలిచింది బాబ్రీ మసీదు కూల్చివేత పథకం ప్రకారం జరగలేదని ఇందులో కుట్రకోణం ఏమీ లేదని కోర్టు తేల్చడం శుభపరిణామం.
ఈ తీర్పును ప్రజలంతా స్వాగతించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆయన అన్నారు.