కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కార్యక్రమం క్రింద సిబిఐటి -కెమికల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సర విద్యార్థులు ఈ రోజు రంగారెడ్డి జిల్లా , గండిపేట మండలం లో ఖానాపూర్ గ్రామం లో జరుగుతున్న స్వచ్ భారత్ మిషన్, బేటీ పడవో & బచావో వంటి బాలికా అభివృద్ధి కార్యక్రమాలు, మిషన్ భగీరథ పథకాలు మరియు పనికి ఆహార కార్యక్రమం అమలు వంటి గ్రామీణాభివృద్ధి కార్యక్రమం అమలు గురించి వివరాలు తెలుసుకున్నారు.
ఆదే విధం గా అంగన్వాడీ, స్వయం సహాయక బృందాలు, మధ్యాహ్న భోజనం, కంటి వెలుగు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరియు గ్రామీణ జీవితంపై పట్టణీకరణ ప్రభావం మొదలైన ఇతర కార్యక్రమాలు గురించి గ్రామ పెద్దలు ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్త గా వ్యవహరించిన బాలకృష్ణ, డాక్టర్ గణేష్ , మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహ ఎంతో అవసరం మరియు మన దేశ మరియు రాష్ట్ర ప్రభుత్వ చేసే అభివృధి పనులు తెలుసుకోవాలి బాధ్యత విద్యార్థులు ఎంతో అవసరం అని తెలిపారు.