39.2 C
Hyderabad
April 28, 2024 15: 00 PM
Slider గుంటూరు

చిలకలూరిపేట మునిసిపాలిటీ అవినీతిపై విచారణ

#Praveen Kumar

చిలకలూరిపేట పురపాలక సంఘం అవినీతి ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ విచారణకు ఆదేశించారు. నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం మంగళగిరి లోని డి ఎం ఏ కార్యాలయంలో గతనెల 17.01.2023న చిలకలూరిపేట పురపాలకసంఘంలో అవినీతి గురించి ఫిర్యాదు చేశారు.

నిష్పక్షపాతంగా విచారణకు ఆదేశించాలని ఏ పి మునిసిపల్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశారు. రావుసుబ్రహ్మణ్యం కు రాసిన లేఖలో 20.02.2023 విచారణ జరపాలని నివేదికను అందించాలని గుంటూరు రీజినల్ జాయింట్ డైరెక్టర్ ని ఆదేశించినట్లు ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈలేఖను 17.02.2023 రావుసుబ్రహ్మణ్యం అందుకున్నారు.

అవినీతి రహిత పాలన ఉండాలని, ప్రజల పన్నుల తో పురపాలక సంఘం నడుస్తోంది అని,అవినీతి ఆరోపణలపై ప్రజల కోసం పోరాడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల పై ఉంటుంది అని ఆయన తెలిపారు. నిజాయితీగా పని చేసే అధికారులకు

అండగా ఉంటామని, అవినీతి అధికారులుకు ముచ్చెమటలు పోయిస్తామన్నారు. ఆర్జేడీకి పూర్తి వివరాలు అందిస్తామని ప్రజా సమస్యలపై,అవినీతి పై లిఖితపూర్వకంగా తెలియజేస్తామని రావుసుబ్రహ్మణ్యం మీడియా కు తెలిపారు.

Related posts

కొల్లాపూర్ మునిసిపల్ కమిషనర్ పై మాజీ మంత్రి జూపల్లి ఫైర్

Satyam NEWS

వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీటీడీ మాజీ ఛైర్మన్

Satyam NEWS

తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య డైరీ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment