ఉప్పల్ డివిజన్ పరిధిలోని ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న పాత ఉప్పల్ భరత్ నగర్ బస్తీలో సీసీ రోడ్ల సమస్య పరిష్కారానికి కి చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి అన్నారు. సిసి రోడ్ల నిర్మాణాలకు రూ.43 లక్షల నిధులను మంజూరు చేయించామని త్వరలోనే పనులను ప్రారంభించెలా చర్యలు తీసుకొంటామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ మందుముల రమేష్ రెడ్డి, ఏఈ వసంత గారు ,HMWS అధికారి సత్యనారాయణ గారు ,రాజశేఖర్ ,సోమ్ జంగయ్య గారు ,పండ్ల బాలయ్య గారు ,సల్ల ప్రభాకర్ రెడ్డి ,మహంకాళి రాజు ,అంకాస్ నరేష్ ,ఈగ చక్రధర్ ,గొరిగ జంగీర్ ,బోరంపేట్ రవి ,కవలి హరి ,పండ్ల మహేందర్ ,మల్లేష్ ,తలారి జంగీర్ ,కావాలి రామ్ ,రంగుల శేఖర్ ,బచ్చ రామ్ తదితరులు పాల్గొన్నారు