కరోనా మహమ్మారి జనాలను ఇబ్బంది పెడుతున్న తరుణంలో చిలుకూరులో వార్షిక బ్రహ్మోత్సవాలు నేడు ధ్వజారోహణంతో నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి.
ధ్వజ పటానికి గరుత్మంతుల వారిని అలంకరించి, యాగశాలలో హోమాలు నిర్వహించారు.
అనంతరం ధ్వజస్తంభానికి, గరుడమూర్తికి అభిషేకం చేసి తదనంతరము అలంకరించి నైవేద్యము, మంగళ హారతి చేసి నలుదిక్కులా గరుడ ముద్దని నైవేద్యం చేసి ఆ ప్రసాదాన్ని అతి తక్కువ మంది సంతానం లేని ఆడవాళ్ళకి సంతానప్రాప్తికి ఇవ్వడం జరిగింది.
ఇదే రీతిలో ఏకాంతంగా మిగిలిన రోజుల ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది.