భక్తుల్లో కలిశారు..సెల్ ఫోన్లు దోచేశారు.. అయితే ఈ దొంగలు పట్టుబడే వారే కాదు… పోలీసులు చేసే రెగ్యులర్ చెకప్ లో ఈ దొంగలు దొరికిపోయారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మేడారం ఆర్చిగేట్ సమీపంలో శుక్రవారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో 6 గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా మేడారం మినీ జాతరకు వచ్చిన భక్తుల సెల్ ఫోన్లు దొంగిలించినట్లు వారు అనుమానించారు.
దాంతో నిందితులను అరెస్టు చేసి .. వారి నుంచి 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని, వాహనాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు.