హైద్రాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో జరిగే పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న సురభి వాణీదేవి కి పలు విద్యాసంస్థలు సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో దిల్ సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ అధినేత, విద్యావేత్త ఏవిఎన్ రెడ్డి తో పాటు ట్రెస్మా సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీపతి శేఖర్ రెడ్డి,ప్రతినిధి సురేందర్ రెడ్డి, లు…మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో సిఎం కెసిఆర్ ను కలిసి వాణిదేవి కి తమ మద్దతు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, నవీన్ రావు తదిరులు పాల్గొన్నారు.