కరోనా వ్యాప్తి పరిస్థితిపై పరిశీలన జరిపేందుకు కేంద్ర బృందాలు నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నాయి. కేంద్ర బృందం రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తుంది. కేంద్ర బృందం కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పర్యటిస్తుంది. ఈ మూడు జిల్లాల్లో కరోనా వైరస్ వ్యాప్తి దారుణంగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ మూడు జిల్లాల్లో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై ఉన్నత స్థాయి సమీక్ష చేస్తారు. ఈ కేంద్ర బృందంలో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారులు ఉంటారు. క్షేత్రస్థాయిలో లాక్ డౌన్ అమలు,సడలింపులు,మద్యం షాపుల నిర్వహణ, భౌతిక దూరం అంశాలపై కేంద్ర బృందం సమీక్ష చేయనున్నది.