భారత మాజీ ఉప ప్రధాన మంత్రి బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి సందర్భంగా అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. స్థానిక శాసనసభ్యులు కాలేరు వెంకటేష్, మాజీ శాసనసభ్యులు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, సెంట్రల్ జిల్లా బిజెపి అధ్యక్షులు డాక్టర్ ఎన్. గౌతం రావు, బిజెపి జోగులాంబ జిల్లా ఇంచార్జ్ బి.వెంకట్ రెడ్డి, బాగ్ అంబర్ పేట డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి బి.పద్మ , అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా & బిజెపి వెంగల్ రావు నగర్ డివిజన్ ఇంచార్జ్ ఏడెల్లి అజయ్ కుమార్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్