భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా శ్రీశైల పుణ్య క్షేత్రంలో స్పర్శ దర్శనం నిలిపివేశారు. నేటి నుండి ఈనెల 23 వరకు శ్రీశైలం మల్లన్న స్పర్శదర్శనం నిలిపివేసినట్లు ఈవో లవన్న తెలిపారు. భక్తులందరికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆర్జితసేవ, స్పర్శదర్శనాలు నిలివేస్తూ దేవస్థానం నిర్ణయం తీసుకున్నది. కార్తీకమాసం భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి స్పర్శదర్శనం నిలిపివేసినట్లు వివరించారు. ఇప్పటికే గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు నిలివేసిన దేవస్థానం ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నది. కార్తీకమాసం ముగిసే వరకు భక్తులందరికి స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుంది.
previous post
next post