చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో హోం మంత్రి మహముద్ అలీ పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మన రాష్ట్ర హోంశాఖ మంత్రులు మహమూద్ అలీ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూచాకలి ఐలమ్మ గొప్ప ధైర్యశాలి అని కొనియాడారు.చాకలి ఐలమ్మ గా గుర్తింపు పొందిన తెలంగాణ తల్లి, వీరవనిత. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీర మాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్య శాలి అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ రాములు ఎమ్మెల్సీ కసిరెడ్డినారాయణరెడ్డి, బాలాజీ సింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.