వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని ఈ నెల 26 న , కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని 27 న కలెక్టరేట్ ఆవరణలో ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నామని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ నేడొక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇరువురి జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు.
జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రెండు వేడుకలలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అధికారులు,సిబ్బంది, అన్ని వర్గాల ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయవలసినదిగా కలెక్టర్ కోరారు.