ఎస్సి వర్గీకరణకు చట్టబద్ధతే లక్ష్యంగా ఈ నెల 28న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి తెలిపారు. మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో మాదిగల అలయ్ బలయ్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ మాదిగలను మోసం చేసిందని మండిపడ్డారు. మాదిగలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బంగారు శృతి, ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం, మాదిగ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున్, ఎన్డీఎస్ఎస్ ఉపాధ్యక్షుడు బూదాల బాబూరావు, ఎంహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మైస ఉపేందర్, టీడీపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగులయ్య,జేఏసీ నాయకులు వీరేందర్, వినాయకరావు,బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకట్,ఓయూ అధ్యక్షుడు బోరెల్లి సురేశ్ పాల్గొన్నారు.