29.7 C
Hyderabad
April 29, 2024 09: 31 AM
Slider నల్గొండ

 ప్రతి ఒక్కరూ  క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి

#bollam

ప్రతి ఒక్కరూ  క్రీడలలో  రాణించాలి అని కోదాడ  శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సూర్యపేట జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని, రెపటి తరానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయని, ప్రతి ఒక్కరూ  క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి అని అన్నారు. క్రీడాకారులకు, కళాకారులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. అలాగే క్రీడలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

అనంతరం గ్రామంలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన  అంగన్వాడి పహారి గోడను  ప్రారంభించారు. అదేవిధంగా ఎమ్మెల్యే  నిధులనుండి ఐదు లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బిందు నరేందర్, పిఎసిఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు తొగరు రమేష్, టిఆర్ఎస్ నాయకులు బుర్ర పుల్లారెడ్డి, కాటమరెడ్డి ప్రసాద్ రెడ్డి, వేమూరి సత్యనారాయణ, ఎలక వెంకట్ రెడ్డి, తుమ్మలపల్లి భాస్కర్,నాయకులు పిల్లుట్ల శీను, ముత్తవరపు రమేష్, సర్పంచ్ నాగమణి సైదులు, గ్రామ శాఖ అధ్యక్షులు బొమ్మ చిన్న వెంకన్న, టిఆర్ఎస్ నాయకులు నాగిరెడ్డి, వీరు, గ్రామ పాలకవర్గం, కబడ్డీ అభిమానులు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

చంద్రబాబు అరెస్ట్ అక్రమం: టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్

Satyam NEWS

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ పునర్ నియామకం

Satyam NEWS

ఇన్షా అల్లాహ్: ఒక్క భార్యతోనే పరేషాన్ అవుతున్న

Satyam NEWS

Leave a Comment