శనగ రైతుల కష్టం నీరుగారిపోవాల్సిందేనా? కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల్ డోంగ్లీ సొసైటీ పరిధిలోని శనగ రైతులు అలో లక్ష్మణా అంటూ వాపోతున్నా పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. దాదాపుగా పది రోజుల నుంచి సొసైటీలో శనగ కుప్పలు వేయడం జరిగినది.
ఆ కుప్పలను సొసైటీ వ్యక్తులు కొని కంటా చేయాలి. అంతేకాకుండా కంటా కు 30 రూపాయలు చొప్పున తీసుకోవాలి. కానీ అక్కడ అక్రమంగా 36 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గజానంద్ పటేల్ శనగ రైతులకు అండగా నిరసన తెలిపారు. అంతేకాకుండా సొసైటీ చైర్మన్ వెంటనే స్పందించి రైతులకు మేలు జరిగే విధంగా నిర్ణయం తీసుకొని శనగ కాంటా వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.