తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 72వ జన్మదినం సందర్భంగా ఏఎస్ రావు నగర్ డివిజన్ జమ్మిగడ్డ ఎన్టీఆర్ చౌరస్తాలో వేడుక ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా టీటీడీపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న, టీటీడీపి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని హాజరై కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమం టీడీపి సీనియర్ నాయకుడు నీరుకొండ సతీష్ బాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నీరుకొండ సతీష్ బాబు ఆధ్వర్యంలో సైనిక్ పురి చౌరస్తా నుండి జమ్మిగడ్డ ఎన్టీఆర్ విగ్రహం వరకు సుమారు 100 బైకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ప్రజలకోసం ఏర్పాటుచేసిన మహా అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి దేశ రాజకీయాల్లో సీనియర్ నేతగా, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారనీ తెలిపారు. 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా, 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. ఉమ్మడి ఏపీలో తెలుగు దేశం పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారనీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఇంచార్జ్ అశోక్ గౌడ్, ప్రసాద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు టి జి కె మూర్తి, రాములు యాదవ్ ప సల ప్రసాద్ ,సాయి నాగార్జున, చిల్కానగర్ టిడిపి అధ్యక్షులు పబ్బతి శేఖర్ రెడ్డి, ఉప్పల్ టిడిపి అధ్యక్షులు తిక్క ప్రకాష్, వెంకటేష్, ఉపేందర్ వెంకటేశ్వర రావు, శ్రీనివాస్, రమేష్, పరంధామయ్య, ఆనంద్ చారి, సత్యనారాయణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి