ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ అకాల మరణం పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు.జగదీష్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. జగదీష్ కుటుంబ
సభ్యులకు తన సానుభూతిని మంత్రి పువ్వాడ తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీకి,ములుగు జిల్లాకు వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. రెండు దశాబ్దాలకు పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో, పాటు పార్టీకి నిబద్ధత కలిగిన నాయకుడిగా సేవలు అందించారని మంత్రి అజయ్ కుమార్ అన్నారు.