బూతుల మంత్రితో పోటీపడి కొబ్బరిచిప్పల మంత్రి చిన్నాపెద్ద లేకుండా నోరుపారేసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం జిల్లా రామతీర్థం రాముని సాక్షిగా వైసీపీ అరాచకం బట్టబయలైందని ఆయన అన్నారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై మంత్రులు వీధి రౌడీల్లా దాడికి తెగించారని ఆయన తెలిపారు. మంత్రులు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేవాలయాల్లో పాటించాల్సిన ఆనవాయితీని ప్రశ్నిస్తే దాడులు చేసే సంస్కృతికి వైసీపీ ప్రభుత్వం దిగజారిందని చంద్రబాబునాయుడు అన్నారు. రామతీర్థం ఆలయ కమిటీ ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజు పేరు లేకుండా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. వేల ఎకరాలను దానం చేసిన కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా.? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అశోక్ గజపతిరాజుపై కక్షగట్టారని, మాన్సాన్ ట్రస్టు చైర్మన్ గా తొలగించి భూములు దోచుకోవాలని చూశారని చంద్రబాబు అన్నారు.
previous post