36.2 C
Hyderabad
May 8, 2024 17: 26 PM
Slider అనంతపురం

చంద్రబాబు అధికారంలో ఉంటే ‘చంద్రన్న క్రిస్మస్ కానుక’ అందేది

#savita

సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణ కేంద్రం లోని కార్యాలయంలో టీడీపీ రాష్ట్రకార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పండగ పూట పేదలు కూడా సంతోషంగా ఉండాలి అనే ఆకాంక్ష తో ఆనాటి  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన, క్రిస్మస్, రంజాన్, సంక్రాంతి కానుకలను రద్దు చేసి, పేదవాడి పొట్టగొట్టిన రద్దుల ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. పండుగల సమయంలో కూడా సీఎం జగన్ పేదలకు సంతోషం లేకుండా చేస్తున్నారని పేదలంటే ప్రేమ అని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి పండుగల సందర్భంగా ఇచ్చే కానుకలు ఎందుకు రద్దు చేస్తారన్నారు.

చంద్రబాబు నాయుడును ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలని జగన్ ఆలోచన చేస్తారు కానీ ప్రజలకు మంచి చేద్దామని ఆలోచన మాత్రం చేయడం లేదన్నారు. పేద క్రిస్టియన్ లు క్రిస్మస్  పండుగను జరుపుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం క్రిస్మస్ కానుకను ఇచ్చింది. అదే విధంగా జెరుసలేం వెళ్లే క్రిస్టియన్ సోదరులకు 50 వేల రూపాయలు ఇచ్చి క్రిస్టియన్ ల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు కృషి చేశారు. కానీ క్రిస్టియన్ ద్రోహి  జగన్ రెడ్డి అవన్నీ రద్దు చేసి క్రిస్టియన్ ల పొట్ట కొట్టాడని తెలియచేసిన సవితమ్మ అన్నారు.

సీనియర్ నాయకులు మాధవ నాయుడు, మాజీ జడ్పీటీసీ వెంకట రమణ, మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు, గుట్టురు మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, ఎర్రమంచి మాజీ సర్పంచ్ సోమశేఖర్ మాగే చెరువు సర్పంచ్ నరసింహులు మాజీ వైస్ సర్పంచ్ సుబ్రహ్మణ్యం, త్రివేంద్ర నాయుడు కొండారెడ్డి  ,బాబుల్ రెడ్డి  ఐ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంజునాథ్, చిన్నపోతన్న, వాసుదేవరెడ్డి అంజినప్ప, గుట్టురు శ్రీనివాసులు,శ్రీకాంత్, సానిపల్లి వెంకటేష్, గోవిందప్ప, సానిపల్లి ఆవుల అంజినప్ప వెంకటేష్, మద్దిలేటి,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

తితిదే బోర్డు సభ్యుల నియామకాలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌

Satyam NEWS

ఖమ్మం కు మరో 100 కోట్లు

Bhavani

పోయిన ప్రాణం..”సర్వజన హాస్పిటల్ ” నిర్లక్ష్యమా..!

Satyam NEWS

Leave a Comment