29.7 C
Hyderabad
May 6, 2024 06: 54 AM
Slider ఆంధ్రప్రదేశ్

చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాపై దాడులా?

chandraba

అధికార వికేంద్రీకరణ ముసుగులో ప్రాంతీయ విద్వేషాలు రగిల్చి రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తోంది వైసీపీ అని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో పేర్కొన్నారు. ట్విట్టర్ లో ఆయన పేర్కొన్న విషయాలు: హిందూపూర్ లో టీడీపీ ఎమ్మెల్యే కాన్వాయ్ పై దాడి.

విశాఖలో టీడీపీ కార్యాలయాన్ని కాగడాలతో చుట్టముట్టడం. ఏమిటివన్నీ? వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అవినీతి, చేతకానితనం, తెలివితక్కువతనం దేశం మొత్తం తెలిసిపోయి, అందరూ తుగ్లక్ అంటుంటే… ఉక్రోషం పట్టలేకే ఈ దాడులు, దౌర్జన్యాలు. దేశంలోనే అతి పెద్ద ఎఫ్.డి.ఐ.. కియా కార్ల పరిశ్రమ, గార్మెంట్ ఇండస్ట్రీస్, విండ్, సోలార్ పవర్ ప్లాంట్లు వంటి అనేక పరిశ్రమలతో సీమలో వేలాది మందికి ఉపాధి కల్పించిన మేము ద్రోహులమా?  

కియా యాక్సిలరీ యూనిట్లు పూణేకు తరిమేసి వేలాది ఉద్యోగాలు పోగొట్టిన వైసీపీ వాళ్ళు ద్రోహులా? ప్రశాంతతకు మారుపేరైన విశాఖలో రౌడీలు కాగడాలు పట్టుకు తిరగడమా? సభ్యత్వం ఇవ్వని క్లబ్బుల భూములకే ఎసరు పెట్టడం… ముడుపులు-వాటాలు ఇవ్వని కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేయడం, ఖాళీగా కనిపించిన భూములన్నీ కబ్జా చేసేయడం. ఇదేనా మీరు విశాఖకు చేస్తున్న మేలు?

Related posts

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టికెట్‌ రేట్ల పెంపుకు అనుమతి

Sub Editor 2

తారకరామ మోక్షజ్ఞ సేవా సంఘం సేవా నిరతి

Satyam NEWS

నిరుపేదలకు వైద్య సహాయం అందిస్తున్నసీఎం కేసీఆర్

Satyam NEWS

Leave a Comment