తనపై చంద్రబాబుకు నమ్మకం సన్నగిల్లిందని, అందుకే పార్టీని వదలివేస్తున్నానని కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ ఇన్ ఛార్జి మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి అన్నారు. చంద్రబాబుకు నాపై నమ్మకం లేదు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నాను. నాకు చంద్రబాబుకు మధ్య అంతరం పెరిగింది.
పులివెందుల్లో ఎన్నికలు అంటే కత్తిమీద సామే. అలాంటి నియోజకవర్గంలో నేను టీడీపీకి సుదీర్ఘ కాలం అండగా ఉన్నాను అయినా చంద్రబాబు నన్ను నమ్మలేదు అని సతీష్ రెడ్డి అన్నారు. నమ్మకం లేని చోట నేను ఉండలేను. అందుకే పార్టీని వీడుతున్నాను అని ఆయన అన్నారు.