దక్షిణ ఇండియాలోనే మొదటిసారిగా రెండు రాష్ట్రాల పరిధిలో హోసూర్-బెంగుళూరు మధ్య మెట్రోరైలు మార్గం ఏర్పాటు కానుంది. బెంగుళూరు బొమ్మసంద్ర, తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూర్ నగరాలు పక్కపక్కనే ఉన్నాయి. ప్రతిరోజు లక్షల మంది ప్రజలు రెండు నగరాలకు ప్రయాణిస్తుంటారు. పారిశ్రామిక నగరమైన హోసూర్ నుంచి బెంగుళూరును కలిపే మెట్రోరైలు పథకం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై నివేదికను తయారు చేయడానికి చెన్నై మెట్రో యాజమాన్యం ఇదివరికే రూ.75 లక్షలు కేటాయించింది. 20.5 కిలోమీటర్లు పొడవున్న ఈ మార్గంలో తమిళనాడులో 8.8 కి.మీ. కర్ణాటకలో 11.7 కి.మీ దూరానికి మెట్రోరైలు ఏర్పాటుకానుంది.