టీడీపీ నుంచి పోటీ చేయాలనేది తన ఆకాంక్ష అని, అయితే నిర్ణయం తీసుకోవాల్సింది చంద్రబాబునాయుడేనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అధికారం అనుభవించి చివర్లో బయటకి వెళ్లడం నాకు ఇష్టం లేదు. అందుకే ముందుగానే అధికార పక్షానికి దూరంగా నిలబడ్డానని ఆయన అన్నారు.
నాకు అండగా నిలిస్తే కష్టాలు తెచ్చుకున్నట్లే… అయినా కూడా నా వెంట అనేక మంది నిలుస్తున్నారు. బెదిరింపులు, కష్టాలు ఎదుర్కొని నా వెనుక నిలిచిన వారికి కృతజ్ఞతలు అని ఆయన అన్నారు. సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జెడ్పి కో ఆప్షన్ సభ్యులు అండగా నిలిచారు. సమస్యలు పరిష్కారం కాకుంటే ప్రజాపక్షాన నిరసన గళం వినిపిస్తానని కోటంరెడ్డి అన్నారు. టీడీపీలో గెలిచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేల చేత స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేపించిన తర్వాత నా
రాజీనామా అడగండి అని ఆయన స్పష్టం చేశారు. దీన్ని స్పీకర్ ఆమోదించి ఆ నియోజకవర్గాల్లో ఎన్నికలకు సిద్దమని ఎలక్షన్ కమిషన్ కి పంపండి… అప్పుడు స్పందిస్తాను. భవిష్యత్ లో ఎలాంటి సమీక్షా సమావేశాలు పెట్టినా మమ్మల్ని పిలిచినా పిలవకున్నా నేను, మేయర్ సమావేశానికి వెళ్తాను. ఇరుకళల అమ్మవారి జాతర చేస్తాను… అనుమతి కోసం దేవాదాయ శాఖకు లేఖ రాస్తాను ఇందులో రాజకీయం చేస్తే అప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుంటాను అని స్పష్టం చేశారు.